పంజాబ్లోని సంగ్రూర్ జైలులో శుక్రవారం అర్థరాత్రి ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని పటియాలాకు తరలించారు. అయితే ఘర్షణ ఎందుకు జరిగిందో తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.