గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ జడ్పీ చైర్మన్

80చూసినవారు
గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ జడ్పీ చైర్మన్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు సందర్శించారు. ఈ సందర్భంగా కనీస వసతులు లేక రీడర్లు ఇబ్బంది పడుతున్నారని, గ్రంథాలయంలో సరిపడా పుస్తకాలు లేవన్నారు. భవనం శిథిలవస్థలో ఉన్నందున నూతన భవనంలోకి మార్చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో లీడర్లకు భోజన సౌకర్యంతోపాటు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రభుత్వం స్పందించి పాఠకులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్