రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్

70చూసినవారు
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సర్వీసెస్ డి. కృష్ణ ప్రసాద్ మంగళవారం వేములవాడ రాజన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపం వేదోక్త ఆశీర్వచనము చేశారు. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ గజ్వేల్ రమేష్ బాబు, పర్యవేక్షకులు తిరుపతిరావు, గడ్డం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.