ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఉదృతం

81చూసినవారు
ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఉదృతం
టంగుటూరి ప్రకాశం, ఎన్‌.జి.రంగా లాంటి ప్రముఖులు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను కలిసి కొత్త రాజ్యాంగ రచన జరగక ముందే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అభ్యర్థించారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. ఈ అంశాన్ని కాంగ్రెసేతర పార్టీలు, కమ్యూనిస్టులు లేవనెత్తడంతో 1948లో నెహ్రూ భాషాప్రయుక్త రాష్ట్రాల పరిశీలనకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ కమిటీ కొత్త రాష్ట్రాల ఏర్పాటు అవసరం లేదని పేర్కొనడంతో ఉద్యమం ఉదృతమైంది.

సంబంధిత పోస్ట్