ఇక్కడ ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల గెలుపు

84చూసినవారు
ఇక్కడ ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల గెలుపు
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 1999 నుంచి 2024 వరకు ఇక్కడ జరిగిన ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన అభ్యర్థులు గెలిచారు.