ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ LG దేశీయంగా రెండు కొత్త స్మార్ట్ మానిటర్లను విడుదల చేసింది. 27 అంగుళాలు, 31.5 అంగుళాల సైజుల్లో, 4K యూహెచ్డీ డిస్ప్లేతో ఈ మానిటర్లు లభిస్తాయి. వీటిని పీసీలానూ వాడుకోవచ్చు. పీసీకి కనెక్ట్ చేయకుండ OTT, టీవీ ఛానెళ్లనూ వీక్షించొచ్చు. ఈ రెండింట్లోనూ 5W స్పీకర్లు, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సి పోర్ట్స్, హెచ్డీఎంఐ పోర్ట్స్ కలిగి ఉన్నాయి.