గ్యాస్ట్రిక్ సమస్య వల్ల పార్కిన్సన్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 9 వేల మందికి పైగా రోగుల ఎండోస్కోపీ నివేదికలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈవిషయాన్ని గుర్తించారు. జీర్ణ వ్యవస్థకు సంభవించే గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్య పార్కిన్సన్స్కు దారితీస్తుందని, ఈ సమస్యలు ఉన్నవారికి పార్కిన్సన్స్ వ్యాధి సంభవించే అవకాశం 76 శాతం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.