యూపీలోని షాజహాన్పూర్ జిల్లా జలాలాబాద్లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ సెలూన్ వెలుపల ఇద్దరు యువకులు కూర్చున్నారు. ఆ సమయంలో వారి పై నుంచి ఓ పాము ఎగురుకుంటూ పోయింది. ఇది గమనించిన యువకులు తొలుత షాక్ అయ్యారు. తర్వాత భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సెలూన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో పాము ఎగరడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.