ఐదేళ్ల క్రితం జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు.