భర్త మరణం తట్టుకోలేక ఓ మహిళ పేగు తెంచుకుని పుట్టిన కుమారునికి ఉరివేసి ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన బెంగళూరులో యలహంక పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. యలహంక ఆర్ఎంజెడ్ అపార్టుమెంట్లో ఉండే పులివర్తి శ్రీధర్(47), రమ్యా(40) దంపతులకు కుమార్తె, కుమారుడు భార్గవ్(13) ఉన్నారు. శ్రీధర్ మూడు నెలల క్రితం క్యాన్సర్తో మరణించారు. అప్పటి నుంచి మనోవేదనకు గురైన రమ్యా తాజాగా ఈ దారుణానికి పాల్పడింది.