నేడు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల

4912చూసినవారు
నేడు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల
తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లకు ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 21 ఉ. 10 గం. లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇక, ఈనెల 22న వర్చువల్ సేవ, 23న అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా, 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా టీటీడీ విడుదల చేయనుంది.