దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110.64 పాయింట్లు కోల్పోయి 73,903.91 వద్ద ముగిసింది. నిప్టీ సైతం 8.70 నష్టపోయి 22,453 పాయింట్ల వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా, HCL టెక్నాలజీ, ICICI బ్యాంక్, సన్ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, SBI, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.