కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ప్రధాని మోదీ వెంట నడుస్తామని, ఎన్డీయేతోనే ప్రయాణం చేస్తామని జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కుమారస్వామి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతారని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు.