Mar 28, 2024, 07:03 IST/భువనగిరి నియోజకవర్గం
భువనగిరి నియోజకవర్గం
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
Mar 28, 2024, 07:03 IST
యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టూరి శివ కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.