దామరచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం

64చూసినవారు
దామరచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం
దామరచర్ల: మండల పరిధిలోని బత్తులపాలెం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై డీసీఎం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్