తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో చోటు చేసుకుంది. ముకుందాపురానికి చెందిన గీత కార్మికుడు బొమ్మకంటి బుచ్చయ్య తాటిచెట్టు ఎక్కుతుండగా జారి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. బుచ్చయ్యను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు.