కోదాడ పట్టణ పరిధిలో శనివారం రాత్రి ఎన్హెచ్ టీం పెట్రోలింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా వాహనాలను తనిఖీ చేయగా 4. 5 కేజీల గంజాయిని సీజ్ చేసి 11 మంది నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి ఐదు టూ వీలర్స్, రెండు త్రీ వీలర్స్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.