సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో బాంబ్ డిస్పోసల్ ఏఎస్ఐ గా పనిచేస్తున్న వెంకటయ్య (53) గుండెపోటుతో శుక్రవారం నల్గొండలో మరణించారు. శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న వెంకటయ్య రాత్రి 11 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన సహా ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది సంతాపం తెలిపారు.