2 వేల ఏళ్లనాటి నాణేలు లభ్యం
సూర్యాపేట జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు ఆదివారం బయటపడ్డాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ద కళాఖండాలుగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. ఆదివారం జరిగిన త్రవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్థంభాలు కనుగొనబడ్డాయి. 2015లో కూడా ఫణిగిరి గ్రామంలో 2వేల ఏళ్ల నాటి బౌద్ద అవశేషాలను పురావస్త శాఖ వారు కొనుగొన్నారు.