గోరక్‌పూర్- మహబూబ్‌నగర్ మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్ల రాకపోకలు పొడిగింపు

85చూసినవారు
గోరక్‌పూర్- మహబూబ్‌నగర్ మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్ల రాకపోకలు పొడిగింపు
గోరక్‌పూర్- మహబూబ్‌నగర్ మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్ నెలలోనూ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. గోరక్‌పూర్‌ –మహబూబ్‌నగర్‌ (05303) మధ్య అక్టోబర్‌ 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. ఇంకా మహబూబ్‌నగర్‌ –గోరక్‌పూర్‌ (05304) మధ్య అక్టోబర్‌ 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు చెప్పింది.

సంబంధిత పోస్ట్