టీ20 వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్కు ఆదివారం వర్షం అంతరాయం కలిగింది. మ్యాచ్ జరుగుతున్న న్యూయార్క్ స్టేడియంలో మరోసారి చిరుజల్లులు కురిశాయి. దీంతో తొలి ఓవర్ పూర్తయ్యాక భారత ఓపెనర్లు రోహిత్, కోహ్లి మైదానాన్ని వీడారు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో రోహిత్ శర్మ సిక్స్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ వికెట్ నష్టపోకుండా ఒక ఓవర్లో 8 పరుగులు చేసింది.