టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగెళ్ల నటించిన తాజా చిత్రం “తంత్ర “. గ్లామరస్ రోల్స్ లో అలరించిన అనన్య ఇప్పుడు హార్రర్ సినిమాతో ప్రేక్షకులను బయపెట్టేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ”ఈ క్రతవుకు మీరు తప్పకుండా రావాలి.. మార్చి 15న థియేటర్లలో ‘తంత్ర’' అనే పోస్టర్ ని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.