స్టేడియంలో చెమటోడుస్తున్న టీం ఇండియా

54చూసినవారు
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నారు. ఈ మేరకు వారు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఎల్లుండి నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం ఆటగాళ్లు సన్నద్ధం అవుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ రోహిత్ శర్మ నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. ఇంగ్లాండ్‌ కోచ్ మెక్కల్లమ్ భారత ప్లేయర్ గిల్ కు సలహాలు ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.