నరసరావుపేట పట్టణంలోని హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. చదలవాడ కారుపై, పలువురు ఓటర్లపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడ్డారు. దాంతో భయాందోళనకు గురైన ఓటర్లు పరుగులు తీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించగా.. టీడీపీ నేతలు అడ్డుకున్నారు.