సోష‌ల్ మీడియా సైన్యంపై తెలుగు సీఎంల ప్రేమ.!

52చూసినవారు
సోష‌ల్ మీడియా సైన్యంపై తెలుగు సీఎంల ప్రేమ.!
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకూ సోషల్ మీడియా సిబ్బంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏపీ అధికార పార్టీ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలను 2017 నుంచి ఐ-ప్యాక్ సంస్థ చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2024 ఏపీ ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ ఐప్యాక్ సిబ్బందికి కొన్ని బహుమతులూ ఇచ్చినట్లు స‌మాచారం. ఇక‌పోతే సీఎం రేవంత్ హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వారికి విందు ఇచ్చారు. తద్వారా తమకు చేసిన సేవలకు అభినందనలు, ప్రశంసలు తెలిపారు.