పొంగిన వాగు.. 40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

81చూసినవారు
పొంగిన వాగు.. 40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
విజయవాడ పరిసర ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గంపలగూడెం మండలం వినగడప కట్టెలేరు వాగుకు భారీగా వరద నీరు చేరింది. అయితే ఒక్కసారిగా వరద నీరు చేరడంతో వాగు ఉప్పొంగి ఉధృతిగా ప్రవహించింది. దీంతో తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు సమీప 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్