టీ20 ప్రపంచ కప్ 2024 వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా క్రికెట్ వెస్టిండీస్కు తీవ్రవాద దాడి హెచ్చరికలు వచ్చాయి. ప్రపంచ కప్ టోర్నీపై ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ శాఖ అయిన ఐఎస్-ఖొరాసాన్ బెదిరించింది. కరేబియన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించింది.