ఆ క్రికెటర్ ఎప్పటికీ దిగ్గజమే: రిజ్వీ

59చూసినవారు
ఆ క్రికెటర్ ఎప్పటికీ దిగ్గజమే: రిజ్వీ
చెన్నై జట్టు ప్లేయర్ సమీర్ రిజ్వీకి తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకొనే క్రమంలో విరాట్ కోహ్లీతో షేక్‌హ్యాండ్‌ ఇస్తుండగా రిజ్వీ తన టోపీని తలపై నుంచి తీశాడు. సీనియర్లకు అతడు ఇచ్చే మర్యాద ఇదంటూ అభినందిస్తూ నెట్టింట కామెంట్లతో ముంచెత్తారు. ఆ తర్వాత విరాట్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిజ్వీ షేర్ చేశాడు. దానికి ‘ఎప్పటికీ దిగ్గజమే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.