తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు వెళ్తోందని.. మన విద్యా విధానం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు సరిపోయేలా ఉందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకే ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు.