ఆ ఒక్క ట్రిక్ వికెట్లు పడేలా చేసింది: అక్షర్

58చూసినవారు
ఆ ఒక్క ట్రిక్ వికెట్లు పడేలా చేసింది: అక్షర్
ఇంగ్లండ్‌తో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో పిచ్‌కు అనుగుణంగా బౌలింగ్ చేయడం వల్లే వికెట్లు తీయగలిగానని అక్షర్ పటేల్ తెలిపారు. ‘పిచ్ చాలా మందకొడిగా ఉంది. బంతి అస్సలు పైకి లేవడం లేదని మా బ్యాటర్లు చెప్పారు. దీంతో తక్కువ వేగంతో బౌలింగ్ వేశా. దీంతో వికెట్లు దక్కాయి’ అని చెప్పారు. కాగా ఈ మ్యాచ్‌లో అక్షర్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్