ఏపీ సీఎంను కలిసిన తెలంగాణ గవర్నర్‌

73చూసినవారు
ఏపీ సీఎంను కలిసిన తెలంగాణ గవర్నర్‌
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు.

సంబంధిత పోస్ట్