టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్ మీద మట్టి తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్శర్మ వెల్లడించారు. 'ఆ పిచ్పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా' అని రోహిత్ తెలిపారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.