రాజ్యాంగంపై దాడిని ప్రతిఘటించిన ప్రతిపక్ష నేతలపైనా వ్యక్తిగత దాడి జరిగిందని, ఇప్పటికీ కొందరు జైలులో ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ప్రధాని మోడీ ఆదేశాలతో నాపైనా దాడి జరిగింది. నా మీద 20కిపైగా కేసులు ఉన్నాయి. నా ఇల్లు తీసేసుకున్నారు. 55 గంటల పాటు నన్ను ఈడీ విచారించింది.’ అని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వం నీట్ను వాణిజ్య పరీక్షగా మార్చేసిందని, ఇది కేవలం ధనికుల కోసం రూపొందించిందని, ప్రతిభావంతులైన వారి కోసం కాదని రాహుల్ ఆరోపించారు.