కేరళలోని తిరువనంతపురం అనయార సమీపంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ స్కూటీ ఓవర్ పాస్పై నుంచి కింద పడింది. సిమి (35) తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సిమి కుమార్తె శివన్య (3), సోదరి సినీ (32) తీవ్రంగా గాయపడ్డారు. సినీ నిద్రమత్తులో స్కూటీ నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.