ప్రేమ పేరుతో రక్తపుటేరులు

5334చూసినవారు
ప్రేమ పేరుతో రక్తపుటేరులు
కర్ణాటక హుబ్బళ్లి ధార్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమత్‌ కుమార్తె నేహా(24) బీవీబీ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీలో ఫయాజ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఫయాజ్‌ను నిరంజన్ మందలించారు. దీంతో కోపం పెంచుకున్న అతడు గురువారం పరీక్షలు రాసి బయటకు వచ్చిన నేహపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రగాయాలతో నేహ ప్రాణాలు విడిచింది.

సంబంధిత పోస్ట్