పాకిస్థాన్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఇళ్లు కూలడం, పిడుగులు పడటం, వరదలకు 87 మంది మరణించినట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. మరో 82 మంది గాయపడినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షాలతో 2,715 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టంపై పాక్ ప్రధాని షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.