లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

65చూసినవారు
లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలో బస్సు ప్రమాదం సంభవించింది. సేలంలోని ఏర్కాడ్‌లో ఓ ప్రైవేట్‌ బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బస్సు 56 మంది ప్రయాణికులతో ఏర్కాడ్‌ నుంచి సేలం వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు 13వ హెయిర్‌పిన్‌ బెండ్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్