చిరుతను తప్పించబోయి కారు బోల్తా.. మహిళ మృతి

60చూసినవారు
చిరుతను తప్పించబోయి కారు బోల్తా.. మహిళ మృతి
చిరుతను తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆయన భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్ అతని భార్య లలిత బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎల్లమ్మకుంట శివారులో చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడింది. లలిత(30) అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం ఉదయం ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్