రికార్డు సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ

69చూసినవారు
రికార్డు సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. జూన్ 23న లాగోస్, నైజీరియాలో జరిగిన టోర్నీలో శ్రీజ డింగ్ యిజీ(చైనా)ని ఓడించారు. మహిళల డబుల్స్‌లోనూ పసిడి నెగ్గిన శ్రీజ ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గానూ ఘనత సాధించారు. డబుల్స్ ఫైనల్లో శ్రీజ-అర్చన జోడీ సహచరులైన దియా-యశస్విని జంటపై గెలిచారు.

సంబంధిత పోస్ట్