మధ్యప్రదేశ్లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఎంపీగా గెలిచాక తన నియోజకవర్గం శివపురిలో తొలిసారి ఆయన పర్యటించారు. రోడ్ షో తర్వాత మాధవ్ చౌక్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కారణంగా టెంట్ కూలిపోయింది. స్టేజిపై ఉన్న సింధియా, ఇతర నాయకులకు ఏమీ కాకుండా కార్యకర్తలు టెంట్ పడిపోకుండా పట్టుకున్నారు. సురక్షితంగా ఆయనను బయటకు తీసుకెళ్లారు.