భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఫిబ్రవరి 17న లాంఛ్ చేసిన ఇన్శాట్-డీఎస్ శాటిలైట్ తొలి చిత్రాలు పంపింది. ఈ చిత్రాల్లో భారత్ ఎంతో అద్భుతంగా కనిపించింది. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో ఆధునాతన ఇమేజర్, సౌండర్ పేలోడ్స్ వంటి పరికరాలున్నాయి. భూమి, భూ వాతావరణానికి సంబంధించిన అంశాలను ఈ పరికరాలు ఎంతో స్పష్టతతో ఫొటోలు తీయడంతోపాటు డేటాను విశ్లేషిస్తాయి.