నేటితో ముగియనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

84చూసినవారు
నేటితో ముగియనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోయజవర్గాల పరిధిలో ఉపఎన్నిక జరగనుంది. జూన్ 5న ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. కాగా బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

సంబంధిత పోస్ట్