కోర్టుకు వింత సమాధానం చెప్పిన పోలీసులు

5086చూసినవారు
కోర్టుకు వింత సమాధానం చెప్పిన పోలీసులు
గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు మద్రాస్ కోర్టుకు వింత సమాధానం చెప్పారు. 2020లో మెరీనా బీచ్ సమీపంలో కొందరు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో నిందితులను తాజాగా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా గంజాయి ఎక్కడుందని జడ్జి ప్రశ్నించగా, ఎలుకలు తిన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్