భారత్లో చాలా మంది ఓటు వేయడంలో నిరాసక్తత ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఆస్ట్రేలియా, పెరూ దేశాల్లో ఓటు వేయని వారికి ఫైన్ విధిస్తారు. సింగపూర్లో ఓటు వేయని వారి పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. బ్రెజిల్లో ఓటు వేయని వారికి జీతంలో కోత ఉంటుంది. ఈక్వెడార్లో ఓటు వేయని వారికి ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు నిలిపి వేస్తారు.