ఢిల్లీలో మొత్తం 15 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన వివిధ ఆసుపత్రులకు చేరుకున్నారు. తొలుత మంగోల్పురిలోని బురారీ ప్రభుత్వ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు ఇ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అధికారులు అణువణువునా తనిఖీలు చేస్తున్నారు.