జగన్ చెప్పినట్లే ఫలితాలు ఆశ్చర్యపరిచాయి: నిమ్మల

1035చూసినవారు
జగన్ చెప్పినట్లే ఫలితాలు ఆశ్చర్యపరిచాయి: నిమ్మల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు. జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించారన్నారు. ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రజలే జగన్ మోసం చేశారంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.