యువకులకు శిరోముండనం చేయించిన ఎస్ఐ.. ఒకరి ఆత్మహత్యాయత్నం

51చూసినవారు
యువకులకు శిరోముండనం చేయించిన ఎస్ఐ.. ఒకరి ఆత్మహత్యాయత్నం
ఓ ఎస్ఐ ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. లింగాలకు చెందిన ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగారు. సమాచారం మేరకు ఎస్ఐ జగన్ స్పాట్‌కు చేరుకుని యువకులను స్టేషన్ తీసుకెళ్లారు. అయితే తమ ముందు యువకులు తల దువ్వుకున్నారనే కారణంతో SI వారికి గుండు కొట్టించారు. ఓ యువకుడు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం.

సంబంధిత పోస్ట్