భక్తులను మెడపట్టి గెంటేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్

65చూసినవారు
ముంబైలోని ‘లాల్‌బాగ్చా రాజా’ గణేష్ ఉత్సవం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భక్తులు క్యూ లైన్‌లో స్వామిని దర్శించుకోడానికి వస్తున్నారు. స్వామి వద్దకు రాగానే వారికి ఒక్క సెకెను కూడా సమయం ఇవ్వకుండా మెడపట్టి పక్కకు గెంటేస్తున్నారు. మరో పక్క కొంతమంది చాలా సేపు అక్కడే నిలబడి వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్