ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

78చూసినవారు
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 3 వరుస విజయాలు సాధించిన భారత్‌.. గురువారం 3-1తో దక్షిణ కొరియాను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భారత్‌ తరఫున అరైజీత్ సింగ్ ఒకటి, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశారు. భారత్‌ శనివారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆరు జట్లు పోటీపడుతోన్న ఈ టోర్నీలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో ప్రవేశిస్తాయి.

సంబంధిత పోస్ట్