బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జొనాస్ కలిసి లాస్ ఏంజెల్స్లో రూ.165 కోట్లు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారు. అయితే తాజాగా ఆ ఇంటిని ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హాలీవుడ్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆ ఇంట్లో నీరు లీకవుతుండటంతో చాలా చోట్ల గోడలు, నేల పాడైనట్లు సమాచారం. దీంతో ఆ ఇంటిని ఖాళీ చేసి, మరో చోటికి వెళ్లిపోయారని మీడియా తెలిపింది.